NewsWorld
PredictionsDigestsScorecardTimelinesArticles
NewsWorld
HomePredictionsDigestsScorecardTimelinesArticlesWorldTechnologyPoliticsBusiness
AI-powered predictive news aggregation© 2026 NewsWorld. All rights reserved.
Trending
TrumpTariffTradeAnnounceLaunchNewsPricesStrikesMajorFebruaryPhotosYourCarLotSayCourtDigestSundayTimelineSafetyGlobalMarketTechChina
TrumpTariffTradeAnnounceLaunchNewsPricesStrikesMajorFebruaryPhotosYourCarLotSayCourtDigestSundayTimelineSafetyGlobalMarketTechChina
All Articles
AP Liquor Scam : ఫిబ్రవరి 27 వరకు వాసుదేవరెడ్డికి రిమాండ్
vaartha.com
Published about 19 hours ago

AP Liquor Scam : ఫిబ్రవరి 27 వరకు వాసుదేవరెడ్డికి రిమాండ్

vaartha.com · Feb 21, 2026 · Collected from GDELT

Summary

Published: 20260221T201500Z

Full Article

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఎక్సైజ్ శాఖలో పెను సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ (ACB) కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను కట్టిన భద్రత నడుమ గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ (SIT) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. CM Revanth : అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. ఆయన దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, విచారణకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారని కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా, ఆయన ఈ కేసులో ‘అప్రూవర్’గా (సాక్షిగా) మారారని, అటువంటప్పుడు ఇంత అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని న్యాయవాది వాదించారు. అంతేకాకుండా, ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ఆ విషయం తేలే వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు రిమాండ్‌కే మొగ్గు చూపింది. ఈ కేసు విచారణలో భాగంగా వాసుదేవరెడ్డి వెల్లడించే విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చడం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి అంశాలపై సిట్ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన అప్రూవర్‌గా మారినట్లు ఆయన తరఫు న్యాయవాది పేర్కొనడంతో, ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరు వరకు రిమాండ్ విధించడంతో, ఈ లోపు సిట్ అధికారులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని మరిన్ని కీలక వివరాలు రాబట్టే అవకాశం ఉంది. Read Also hindi news: hindi.vaartha.com Read Also Epaper : epaper.vaartha.com గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.


Share this story

Read Original at vaartha.com

Related Articles

vaartha.comabout 19 hours ago
Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

Published: 20260221T201500Z

vaartha.com2 days ago
Kerala medical case : ఆపరేషన్ షాక్ , మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

Published: 20260220T181500Z

vaartha.com7 days ago
YCP : రైతులకు రూ . 20వేలు ఎక్కడంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రశ్న

Published: 20260215T163000Z

vaartha.com8 days ago
రోడ్డు - రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్ ఆమోదం

Published: 20260214T130000Z

economictimes.indiatimes.com39 minutes ago
SBI aims to hike its green advances portfolio up to 10 pc by 2030

Published: 20260222T144500Z

diariopalentino.esabout 1 hour ago
Sanz : Al festival de cine de Aguilar le espera un futuro ilusionante | Todas las noticias de Palencia

Published: 20260222T143000Z