
vaartha.com · Feb 21, 2026 · Collected from GDELT
Published: 20260221T201500Z
తెలంగాణలో ‘రైతు భరోసా’ పథకం అమలుపై నెలకొన్న జాప్యం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా పేరుతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులను నిలువునా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు నిధులు ఠంచనుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. CM Revanth : అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్ ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ భవిష్యత్తులో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హరీశ్ రావు హెచ్చరించారు. రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయని పక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. కేవలం రైతుల సమస్యలే కాకుండా, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం దుర్మార్గమని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు రైతు సమస్యల చుట్టూ మరింత వేడెక్కుతున్నాయి. Read Also hindi news: hindi.vaartha.com Read Also Epaper : epaper.vaartha.com గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.